*పదిలో మెరిసిన వంట మేస్త్రీ కుమార్తె హాసిని*

*నియోజకవర్గంలో టాప్ మార్కులు 591కి*

నాగాయలంక -

చదువుకు పేదరికం అడ్డు కాదని నిరూపించింది ఈ విద్యార్థిని. పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో నాగాయలంక జడ్పీ హైస్కూల్ కు చెందిన పొనుగుమాటి హాసిని ఉత్తమ ప్రతిభ కనబర్చింది.

ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో చదివి నియోజకవర్గంలో ప్రథమ స్థానంలో నిలిచింది. 600 మార్కులకు 591 మార్కులు సాధించి తానేంటో నిరూపించుకుంది.

నాగాయలంక వసతిగృహంలో ఉంటూ చదువుకున్న ఓ ఎస్సీ బాలిక ప్రథమ స్థానంలో నిలిచి అందరిని ఆకట్టుకుంది.

తల్లి గృహిణి కాగా, తండ్రి 'కోడూరు మండలం ఉల్లిపాలెంలో మోషే హోటల్లో వంట మేస్త్రీగా పని చేస్తున్నారు. చదువు పట్ల ఆసక్తి ఉండటంతో నాగాయలంక హాస్టల్లో ఆరవ తరగతి నుంచి పదవ తరగతి వరకు హాసిని చదివింది.

ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తోపాటు ఉపాధ్యాయులు, విద్యావేత్తలు, రాజకీయ నాయకులు ఈ విద్యార్థి సాధించిన ఫలితం పట్ల అభినందనలు తెలుపుతున్నారు.
*పదిలో మెరిసిన వంట మేస్త్రీ కుమార్తె హాసిని* *నియోజకవర్గంలో టాప్ మార్కులు 591కి* నాగాయలంక - చదువుకు పేదరికం అడ్డు కాదని నిరూపించింది ఈ విద్యార్థిని. పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో నాగాయలంక జడ్పీ హైస్కూల్ కు చెందిన పొనుగుమాటి హాసిని ఉత్తమ ప్రతిభ కనబర్చింది. ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో చదివి నియోజకవర్గంలో ప్రథమ స్థానంలో నిలిచింది. 600 మార్కులకు 591 మార్కులు సాధించి తానేంటో నిరూపించుకుంది. నాగాయలంక వసతిగృహంలో ఉంటూ చదువుకున్న ఓ ఎస్సీ బాలిక ప్రథమ స్థానంలో నిలిచి అందరిని ఆకట్టుకుంది. తల్లి గృహిణి కాగా, తండ్రి 'కోడూరు మండలం ఉల్లిపాలెంలో మోషే హోటల్లో వంట మేస్త్రీగా పని చేస్తున్నారు. చదువు పట్ల ఆసక్తి ఉండటంతో నాగాయలంక హాస్టల్లో ఆరవ తరగతి నుంచి పదవ తరగతి వరకు హాసిని చదివింది. ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తోపాటు ఉపాధ్యాయులు, విద్యావేత్తలు, రాజకీయ నాయకులు ఈ విద్యార్థి సాధించిన ఫలితం పట్ల అభినందనలు తెలుపుతున్నారు.
Like
7
0 Comments
0 Shares
295 Views
0 Reviews