https://tv9telugu.com/videos/viral/mumbai-to-dubai-in-2-hours-the-ambitious-underwater-train-project-1707126.html
TV9TELUGU.COM
2 గంటల్లో ముంబై టు దుబాయ్.. అది కూడా రైల్లో వీడియో
ముంబైలో బ్రేక్ ఫాస్ట్ చేసి, దుబాయ్లో భోజనం చేయడం సాధ్యమేనా? వినడానికి సైన్స్ ఫిక్షన్లా అనిపించినా, ఓ భారీ ప్రాజెక్ట్పై ఇప్పుడు చర్చ జరుగుతోంది. అరేబియా సముద్రం గుండా వెళ్లే అండర్వాటర్ ట్రైన్ ప్రాజెక్ట్ వీడియో తాజాగా ఇన్స్టాగ్రామ్లో వైరల్ అవుతోంది. ‘డీప్ బ్లూ ఎక్స్ప్రెస్’ అనే ట్రైన్ను అరేబియా సముద్రం అడుగున నిర్మించి భారత్ను యూఏఈతో అనుసంధానం చేయనున్నారు. ఈ రైలు గంటకు వెయ్యి కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుందని, ఇది విమానాల కంటే కూడా వేగమని వీడియోలో తెలిపారు. హైపర్సోనిక్ వేగంతో ప్రయాణించే ఈ ట్రైన్ ద్వారా రెండు గంటల్లో దుబాయ్ చేరుకునే అవకాశం ఉంటుందట. అంతేకాదు అండర్వాటర్ సొరంగం గోడల వెంట పానోరమిక్ గ్లాస్ విండోలు అమర్చుతారు.
0 Shares
131 Views
0 Reviews