కేరళలో దాదాపు 270 ఏళ్ల తర్వాత 'మహామాఘ మహోత్సవం' మొదలైంది. నీలా నది తీరాన జరిగే ఈ కుంభమేళాకు దేశం నలుమూలల నుంచి భక్తులు వస్తున్నారు. మౌని అమావాస్య నుంచి మాఘ పౌర్ణమి వరకు ఈ క్రతువు జరుగుతుంది. చివరిగా 1750లో నిర్వహించినట్టు రికార్డులు వెల్లడిస్తున్నాయి. అయితే, ఈ ఉత్సవం కోసం చేపట్టిన రథయాత్రకు తమిళనాడు ప్రభుత్వం అనుమతి నిరాకరించడంతో కొంచెం గందరగోళం నెలకొంది. ఈ ఉత్సవాలు ఫిబ్రవరి 3 వరకు కొనసాగుతాయి.