తెలంగాణ కుంభమేళ..మేడారం మహాజాతర విజయవంతంగాపరిసమాప్తమైంది. చల్లని తల్లులు సమ్మక్క-సారాలమ్మ జనం నుంచి మళ్లీ వనంలోకి అంతర్ధానమయ్యారు. ఆదివాసీ ఆచార సంప్రదాయాల ప్రకారం చల్లని తల్లుల వనప్రవేశ ఘట్టం సజావుగా ముగిసింది. అశేష భక్తుల జయజయధ్వానాల నడుమ సమ్మక్కను మళ్లీ చిలకలగుట్టకు తరలించారు ఆదివాసీ పూజారులు.